28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

Nita Ambani-Rohit Sharma: అంతా ఓకేనా.. రోహిత్, నీతా అంబానీ సీరియస్‌ మీటింగ్!

Date:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ముంబై.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి విజయంను ఖాతాలో వేసుకుంది. టీమ్ విజయం సాధించినా.. అభిమానులను మాత్రం ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. అది మరేదో కాదు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌. ఐపీఎల్ 2025లో ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్‌ 21 పరుగులు మాత్రమే చేశాడు. ఫాన్స్ మాత్రమే కాదు.. ముంబై ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ కూడా ఆందోళన చెందుతున్నారు.

Also Read: SRH vs HCA: ఐపీఎల్ 2025 టిక్కెట్ల వ్యవహారం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ!

కేకేఆర్ మ్యాచ్ అనంతరం నీతా అంబానీ, రోహిత్ శర్మలు మైదనంలో మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో నీతా కాస్త సీరియస్‌గా కనిపించారు. రోహిత్‌తో సీరియస్‌గా డిస్కస్ చేశారు. నీతా మాట్లాడుతుండగా.. రోహిత్ అలా చూస్తుండిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. నీతా, రోహిత్ ఏం అంశం గురించి మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. హిట్‌మ్యాన్‌ ఫామ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీటిపై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘రోహిత్ సరిగా ఆడడం లేదు.. అంతా ఓకేనా’, ‘రోహిత్.. ఏమైంది నీకు ఆడడం లేదు’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

கூடலூர்: ஆட்கொல்லி புலி விவகாரம்; 2-வது நாளாக தொடரும் வேலை நிறுத்தம்! – பதற்றத்தில் காவல்துறை!

நாட்டில் மனித - வனவிலங்கு எதிர்கொள்ளல்கள் அதிகம் நிகழும் மாவட்டங்களில் ஒன்றான...

ಮೈಸೂರು ದಸರಾ: ಅರಮನೆ ಪ್ರವೇಶ ವೇಳೆ ಗಾಬರಿಗೊಂಡ ‘ಶ್ರೀರಾಮ’ ಆನೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,28,2026 (www.justkannada.in):  ವಿಶ್ವ ವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಸಾಂಸ್ಕೃತಿಕ...

വിശ്വാസികൾക്ക് എത്രത്തോളം വേദനയുണ്ടാക്കും ; സണ്ണി എം. കപിക്കാട് മാപ്പ് പറയണം – അബ്ദുള്ള ബാസിൽ

ജാതീയതയുടെ പേരിലുള്ള ഒരുപാട് പീഡനങ്ങൾ അനുഭവിച്ചവരാണ് ദളിതർ. അവരുടെ ആശയപ്രചാരണത്തിനും അഭിപ്രായസ്വാതന്ത്ര്യത്തിനും...