20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

KTR : తెలంగాణ పరిశ్రమల అంశంపై కేటీఆర్ విమర్శలు

Date:

KTR : తెలంగాణలో ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిశ్రమలు నాశనం అవుతున్నాయని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊసేలేకుండా ఉండటం విచారకరమని తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రధానంగా బయ్యారంలోని ఉక్కు పరిశ్రమ స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మరోవైపు, ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కేటీఆర్ విమర్శించారు.

బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా తెలంగాణ పరిశ్రమల సమస్యలపై ఒక్కరు కూడా స్పందించలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారు కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలకు కొత్త పరిశ్రమలు కావాలని అడిగే నేతలు లేకపోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కాపాడాలని అడగలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను కూల్చే పనిలో ఉండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని వేలానికి పెట్టే పనిలో ఉందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ, అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజల అభివృద్ధిపై అసలు ఆసక్తి లేదని, వీరి దృష్టిలో ఓట్లు, సీట్లే ముఖ్యమని విమర్శించారు. తెలంగాణ ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమైన పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వాల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.

Donald Trump: యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాశాఖ రద్దు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തിലടക്കം പരാജയപ്പെടുത്തണം; നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പുകളില്‍ ബി.ജെ.പിയ്ക്ക് തിരിച്ചടി നല്‍കണമെന്ന് സംയുക്ത കിസാന്‍ മോര്‍ച്ച

ന്യൂദല്‍ഹി: വരാനിരിക്കുന്ന നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പുകളില്‍ ബി.ജെ.പിയെ പരാജയപ്പെടുത്താന്‍ ആഹ്വാനവുമായി സംയുക്ത കിസാന്‍...

சீனா நோக்கிச் சென்ற 7 ரஷ்ய கப்பல்கள்; திடீரென இந்தியாவுக்கு வருவது ஏன்?!

சீனாவுக்குச் செல்லவிருந்த ஏழு ரஷ்ய கச்சா எண்ணெய் கப்பல்கள், திடீரென திசைமாற்றப்பட்டு...

War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ చేస్తున్న దాడుల...

താനൂരില്‍ നിന്നും തിരൂരിലേക്ക്; വി. അബ്ദുറഹിമാന്‍ മണ്ഡലം മാറി

മലപ്പുറം: താനൂര്‍ മണ്ഡലത്തില്‍ എല്‍.ഡി.എഫ് സ്ഥാനാര്‍ത്ഥിയായി പ്രഖ്യാപിച്ചിരുന്ന വി. അബ്ദുറഹിമാന്‍ മണ്ഡലം...