16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Supreme Court: అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

Date:

దృష్టిలోపం ఉండి న్యాయ సేవలోకి రావాలనుకునే వారికి బిగ్ రిలీఫ్. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం అంధుల కోసం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు కూడా న్యాయ సేవలలో నియమించబడే హక్కు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చని కోర్టు పేర్కొంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులను న్యాయ సేవ నుంచి మినహాయించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సోమవారం కొట్టివేసింది.

Also Read:Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..

వైకల్యం ఆధారంగా ఎవరినీ న్యాయ సేవల నుంచి మినహాయించలేమని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. న్యాయ సేవా అవకాశాలను పొందడంలో వికలాంగులు ఎటువంటి వివక్షను ఎదుర్కోకూడదని హక్కు ఆధారిత విధానం అవసరం అని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తన నిర్ణయంలో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను కూడా రద్దు చేసింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు న్యాయ సేవల నియామక ఎంపిక ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించే మధ్యప్రదేశ్ న్యాయ సేవల నిబంధనలను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Also Read:Revolt RV BlazeX: సరసమైన ధరలో కిల్లింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్

మధ్యప్రదేశ్ న్యాయ సేవల నియమాల రూల్ 6A దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు, తక్కువ దృశ్యమానత ఉన్నవారు న్యాయవ్యవస్థలో చేరడానికి అనుమతి నిరాకరిస్తుంది. మధ్యప్రదేశ్ న్యాయ సేవలు(నియామక, సేవా నిబంధనలు) 1994 లో అమలు చేయబడ్డాయి. తాజాగా సుప్రీం కోర్టు ఈ నిబంధనలను కొట్టివేసింది. కాగా మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను ఓ మహిళ 2024లో కోర్టులో సవాలు చేసింది.

Also Read:Mahesh Kumar Goud: కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుంది..

దృష్టి లోపం ఉన్న తన కొడుకు న్యాయవ్యవస్థలోకి రావాలనుకోవడంతో మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలపై 2024 మార్చిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ కు లేఖ రాసింది. ఆయన ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చారు. మార్చి 2024లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చి, దృష్టి లోపం ఉన్న అభ్యర్థులను రాష్ట్రంలో న్యాయ అధికారులుగా నియమించకుండా నిరోధించే మధ్యప్రదేశ్ న్యాయ సేవల నిబంధనల చెల్లుబాటును పరిశీలించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹോളിക്കിടെ സംഘര്‍ഷം, ഹിന്ദു യുവാവിന്റെ മരണം; ദല്‍ഹിയില്‍ 70 കടകള്‍ ഇടിച്ചുനിരത്തി

  ന്യൂദല്‍ഹി: ഹോളി ആഘോഷത്തിനിടെയുണ്ടായ സംഘര്‍ഷത്തില്‍ ഹിന്ദു യുവാവ് കൊല്ലപ്പെട്ട സംഭവത്തില്‍...

Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

లాస్ ఏంజిల్స్: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారాలైన 98వ అకాడమీ...

2026 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പ് നിര്‍ണായകം; കേരളത്തില്‍ എല്‍.ഡി.എഫ് വീണ്ടും അധികാരത്തില്‍ വരും: ഡി. രാജ

ചെന്നൈ: കേരളത്തില്‍ മൂന്നാം തവണയും എല്‍.ഡി.എഫ് അധികാരത്തില്‍ വരുമെന്ന് സി.പി.ഐ ജനറല്‍...