14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

UP: దారుణం.. తల్లిదండ్రులు, సోదరిని నరికి చంపిన వ్యక్తి.. ఎందుకంటే..?

Date:

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజీపూర్ జిల్లాలోని డెలియా గ్రామంలో ఓ కొడుకు తన తల్లి, తండ్రి, సోదరిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రాంతాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితుడిని అభయ్ యాదవ్‌గా గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

READ MORE: Upcoming Smartphones: మెస్మరైజ్ చేసే ఫీచర్లతో.. ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతున్న 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని కేసును ధృవీకరించారు. మృతులను శివరామ్ యాదవ్, అతని భార్య, కుమార్తెగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. పొదల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను కనుగొన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శివరామ్ యాదవ్ తన భూమిలో కొంత భాగాన్ని తన కుమార్తెకు బదిలీ చేశాడు. దీనికి అతడి కుమారుడు అభయ్ అడ్డు చెప్పాడు. ఈ శనివారం తీవ్ర మలుపు తిరిగింది.

READ MORE: Varun Sandesh : వరుణ్‌ సందేశ్ కొత్త మూవీ స్టార్ట్..

అభయ్ యాదవ్ వివాహం చేసుకుని తల్లిదండ్రుల నుంచి విడిగా ఉంటున్నాడు. అతని సోదరి వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వారికి సేవ చేసింది. ఇది అభయ్ కు నచ్చలేదు. తండ్రి ఆమెకు భూమిలో భాగం సైతం రాసి ఇచ్చాడు. ఈ అంశంపై తాజాగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూమి ఇచ్చేదే లేదని అభయ్ అడ్డుపడ్డాడు. ఈ విషయంలో తల్లిదండ్రులతో సహా సోదరిని చంపేశాడు. ఈ దారుణమైన నేరాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామస్థులను నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

“கூட்டணிக்காக நாங்கள் யாரையும் எதிர்பார்த்து இல்லை" – அண்ணாமலை அதிரடி

கோவையில் பாஜக முன்னாள் மாநில தலைவர் அண்ணாமலை செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது அவர்...

Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!

Milk Purity: చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరమైన...

4,824 ಕೋಟಿ ರೂ. ಮೊತ್ತದ ಬಂಡವಾಳ ಹೂಡಿಕೆಗೆ ಸಮ್ಮತಿ: ಸಚಿವ ಎಂ. ಬಿ. ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in): ವಿಜಯಪುರ, ಬಾಗಲಕೋಟೆ, ಚಿತ್ರದುರ್ಗ, ಕೋಲಾರ, ರಾಮನಗರ ಸೇರಿದಂತೆ ...

മൊജ്തബ ഖാംനഇ അടക്കമുള്ളവരെ കുറിച്ച് വിവരം നൽകുന്നവർക്ക് പത്ത് മില്യൺ; പാരിതോഷികം പ്രഖ്യാപിച്ച് അമേരിക്ക

വാഷിങ്ടൺ: ഇറാന്റെ പുതിയ പരമോന്നത നേതാവ് ആയത്തുല്ല മുജ്തബ ഖാംനഇ അടക്കമുള്ള...